కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విదేశీ పర్యటనకు ఎట్టకేలకు కోర్టు షరతులతో అనుమతి లభించింది. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు జామీను, పర్యటన పూర్తి వివరాలు ముందుగా సమర్పించాలని ఆదేశించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్లో ఉంచి, జూలై 15లోపు భారత్కు రావాలని సూచించింది. తిరిగి వచ్చిన వారం రోజుల్లో కోర్టులో హాజరు కావాలని పేర్కొంది.