NDL: బేతంచెర్ల మండలంలో రేపటి నుంచి 30 వరకు నిర్వహించే జనాభా గణనకు ప్రజలు సహకరించాలని మంగళవారం తహసీల్దార్ నాగమణి కోరారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వివరాలు అందజేయాలని చెప్పుకొచ్చారు. సందేహాల నివారణకు 1885 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని ఆమె స్పష్టం చేశారు.