ASR: కొయ్యూరు మండలం గరిమండ గ్రామానికి చెందిన మర్రి సుమిత్ర (29)కి శుక్రవారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది అంబులెన్సులో వెంటనే అక్కడకు చేరుకున్నారు. గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో EMT లక్ష్మి, పైలెట్ హరి ప్రసాద్ ప్రసవం చేశారు. అనంతరం తల్లిబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.