సత్యసాయి: పెనుకొండలో మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం శనివారం వాయిదా పడటంపై టీడీపీ పట్టణ కన్వీనర్ శ్రీరాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాల్సిన కీలక సమావేశాన్ని కావాలనే వాయిదా వేశారని వైసీపీ కౌన్సిలర్లపై ఆరోపించారు. బుధవారానికి సమావేశం వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ తెలిపారు.