మార్కాపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ఎలాంటి కొరత లేదని కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మేరకు పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, అవసరం లేకుండా కొనుగోలు చేయొద్దన్నారు.