ATP: గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో నివాసముండే షాహినా అనే మహిళ ఇంట్లో శనివారం రాత్రి 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం జిల్లా క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. కిటికీలు, డోర్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. పరిసరాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.