E.G: ప్రతి వార్డును పార్టీ ప్రచార కేంద్రంగా మార్చాలని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ సూచించారు. ఆదివారం 6వ వార్డు పర్యటనలో కార్యకర్తలతో సమావేశమై జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.