ప్రకాశం: పీసీపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బి.నరసింహారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఎస్సై తెలిపారు. ప్రజల సమస్యలపై తక్షణ స్పందనతో సేవలందిస్తానని పేర్కొన్నారు.