అన్నమయ్య: మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన ఇంజనీరింగ్ శాఖల సమీక్షా సమావేశం జరిగింది. వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, అనుమతుల సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.