కోనసీమ: ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు సంతాప సభలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని భావోద్వేగంగా నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. చింతపల్లి వీరభద్రరావు విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, కల్మషం లేని మనిషి అని కొనియాడారు. పదవి కంటే మానవ సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడని గుర్తు చేశారు.