పల్నాడు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండలోని NSP జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇవాళ ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గతంలోనే టీడీపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచిందని గుర్తు చేశారు.