KDP: ప్రొద్దుటూరులోని పుట్టపర్తి నారాయణాచార్యులు గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపును MEOలు సావిత్రమ్మ, శోభారాణి ప్రారంభించారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని వారు తెలిపారు. సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.