GNTR: తెనాలి ఐతానగర్లో శ్రీ వెంకయ్య-గౌరమ్మ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మే 1 వరకు జరిగే వేడుకల్లో అఖండ దీపం, ఊరేగింపు, గుమ్మడి సిడి, జల బిందెలు, పూలకప్పెర వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం పొంగళ్లు, మొక్కుబడులతో ఉత్సవాలు ముగుస్తాయి.