సత్యసాయి: ధర్మవరం పట్టణంలో వైభవంగా జరిగిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మరథోత్సవంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు భారీగా తరలివచ్చి రథాన్ని లాగుతుండగా మంత్రి వారితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.