NTR: నందిగామ మండలంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్.వీ.ఎస్.హెచ్.వి.యం ప్రసాదరావు ఐతవరం గ్రామంలో పశువుల తొట్టెను పరిశీలించారు. అక్కడి నిర్వహణపై సూచనలు ఇచ్చారు. అలాగే సెన్సెస్ 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం సిబ్బంది రోజుకు కేటాయించిన 20 టార్గెట్ పూర్తి చేస్తున్నారా అనే అంశంపై రికార్డులను పరిశీలించారు.