KDP: ఒంటిమిట్ట పరిధిలో పలు కేసుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుల దూషణ, దాడి కేసులో ముగ్గురు, హత్య కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్పీ మనోజ్ హెచ్చరించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.