CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం కొల్లాగుంటలో భూవివాదం కలకలం రేపుతోంది. జయమ్మ కుటుంబానికి చెందిన 0.38 సెంట్ల భూమిని సుంకర మునికృష్ణయ్య ఆక్రమించి, వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన డాక్టర్ యుగంధర్ పొన్న, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.