WG: ఇరాన్ పై అమెరికా యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ శనివారం భీమవరంలో సీపీఎం జిల్లా కమిటీ భారీ ర్యాలీ నిర్వహించింది. పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసు నుంచి సబ్ జైలు పెట్రోల్ బంక్ వరకు ఈ నిరసన సాగింది. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ విమర్శించారు.