CTR: పలమనేరు-చిత్తూరు రోడ్డులోని ఓ పాఠశాల వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని శుక్రవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. కేవలం వైర్ల ఆధారంగా పోల్ నిలబడి ఉంది. ఎప్పుడు నేల కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన స్థానికులు ఎవరూ దగ్గరకు వెళ్లకుండా రాళ్లు పెట్టి, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు.