ELR: వేలేరుపాడు (మం) బండ్ల బోరు గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో మండల సమావేశం మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కారం దారయ్య మాట్లాడుతూ.. ఈనెల 17న పెద్ద వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చేస్తున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అనేక లాభాలు కలుగుతాయని వివరించారు.