KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.