విశాఖలో ఆంధ్రయూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ఇవాళ ప్రారంభించారు. ఉద్యోగుల సేవలు విశ్వవిద్యాలయ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఉద్యోగి, చిత్రకారుడు మహ్మద్ గౌస్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.