CTR: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో భూ ఆక్రమణలపై సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 13లో 32 కుటుంబాలకు చెందిన భూమిని రామసుబ్బారెడ్డి ఆక్రమించి కాంపౌండ్ నిర్మిస్తున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 13న హతిరాంజీ మఠం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. భూమిని రక్షించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.