PLD: యడ్లపాడుకు చెందిన షేక్ శంషాద్బీకి సీఎం సహాయనిధి నుంచి రూ.1,03,447 మంజూరయ్యాయి. మంగళవారం ఈ ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదల వైద్యానికి కూటమి సర్కారు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నామని ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలిపారు.