VZM: ట్రాక్టర్పై నుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు. పార్వతీపురం మండలం కారాడ వలస నుంచి బొబ్బిలి మండలం డొంగురు వలస పెళ్లికి వెళ్లారన్నారు. అనంతరం ట్రాక్టర్పై తిరిగి వెళ్తుండగా మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నడపడం వల్ల తొట్టెలో ఉన్న వంశీ జారిపడి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.