VSP: విశాఖ మెట్రోను భోగాపురం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. రుషికొండలో టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నందున మెట్రో అనుసంధానం ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మొత్తం 76.90 కి.మీ మేర 4 కారిడార్లను ప్రతిపాదించామని తెలిపారు.