VZM: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా నియోజకవర్గంలో గల ఆలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలానే, వారికి బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తప్పకుండా బొబ్బిలి రావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు.