VZM: నూతనంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమింపబడ్డ గంట్యాడ శ్రీదేవి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయ, మంత్రులు లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.