KRNL: కోసిగిలో ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థి మృతి చెందడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు కంపాటి నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఆర్టీసీలో ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.