PLD: ఈపూరులో శ్రీ బోటిమీద ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్లు ఆదివారం ఘనంగా జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.