NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కనకదుర్గమ్మ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరగనుంది. గతంలో జొన్నవాడ ఆలయ ఛైర్మన్గా విశేష సేవలందించిన పుట్టా లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడును ఈ ఆలయ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీ. ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.