ASR: జిల్లాలో పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి, ఈనెల 24లోగా పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ టీ.నిశాంతి గురువారం అధికారులను ఆదేశించారు. ఈమేరకు వైద్య బృందాలతో ప్రణాళికలను రూపొందించుకొని, బృందాలుగా పాఠశాలలను సందర్శించి, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. 14నుంచి 15ఏళ్ల లోపు బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్లను అందించాలన్నారు.