ATP: అనంతపురం మార్కెట్ యార్డ్కు వచ్చే రైతులు, వ్యాపారుల కోసం ఉచిత భోజన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఈ నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక నుంచి ప్రతి శనివారం, ఆదివారం యార్డ్ ప్రాంగణంలో ఉచిత భోజనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.