నెల్లూరు: రాపూరు అటవీ ప్రాంతంలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఈ విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి(24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు వదిలారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.