ప్రకాశం: ఇటీవల రాయవరం దగ్గర జరిగిన బస్సు ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో స్పందించి ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన సీఐ సుబ్బారావును బీజేపీ నాయకులు శనివారం సత్కరించారు. సమాచారం అందుకున్న సీఐ సకాలంలో స్పందించి సహాయ చర్యలలో పాల్గొని పలువురు ప్రాణాలు కాపాడారు అంటూ ఆయనను అభినందిస్తూ శాలువాలు కప్పి సత్కరించారు.