కోనసీమ: అమలాపురం మండలం పేరూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విన్నా నరసింహ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఒకేషనల్, ఇంటర్ ఓపెన్ పరీక్షలలో పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ నియామకాల ప్రకారం తక్కువ ఫీజులతో జాయిన్ చేసుకుంటామని తెలిపారు.