కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయంలో టీడీపీ టౌన్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా పండ్రాజు సాంబయ్య, ఇతర కమిటీ సభ్యులతో, జిల్లా పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేయించి, నియామక పత్రాలను అందజేశారు. నేడు ప్రమాణస్వీకారం చేసిన నాయకులు పదవులను బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే రాము అన్నారు.