సాధారణంగా చలికాలంలోనే చర్మం పొడిబారుతుందని మనం అనుకుంటాం. కానీ వేసవి ఎండలు కూడా చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని తేమ చెమట రూపంలో ఆవిరైపోయి చర్మం పొడిబారుతుంది. నిరంతరం ఏసీ గదుల్లో ఉండటం వల్ల కూడా చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. కాబట్టి, వేసవిలో అధికంగా నీరు తాగుతూ.. మాయిశ్చరైజర్ వాడటం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.