SKLM: అరసవిల్లిలోని ఆదిత్యుడిని మినిస్ట్రీ అఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ గుప్త మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయం కార్యనిర్వాహణాధికారి కే. ఎన్. వి. డి. వి. ప్రసాద్ సాదరంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం చేయించి, ఆలయ చరిత్రను చెప్పారు.