ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని TDP ఇంఛార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ, మంత్రి నారా లోకేష్ను కోరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. కాలేజీకి భవనాల లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.