AKP: ప్రభుత్వం తమకు ఇచ్చిన అసైన్డ్ భూములను వదులుకునే ప్రసక్తే లేదని రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దళిత రైతులు స్పష్టం చేశారు. భూములు స్వాధీనం చేసుకోవడానికి అధికారులు నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా మంగళవారం విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత రైతులు ర్యాలీ నిర్వహించారు. తామంతా కుటుంబాలతో ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నారు.