NDL: ఉగాది ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు నందవరం చౌడేశ్వరి మాత భక్తులకు విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్లు పీవీ కుమార్ రెడ్డి, పీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రోచ్చారణల మధ్య కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి, విశేష పూజలు చేశారు.