కృష్ణా: యనమలకుదురులో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల వివరాల మేరకు.. భర్తతో విభేదాల నేపథ్యంలో తండ్రి ఇంట్లో పిల్లలతో నివసిస్తున్న హేమలతాబాయిని ఈ నెల 7న తమ్ముడు రాజునాయక్ ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశాడు. కొద్ది రోజులు గడువు ఇవ్వాలని ఆమె కోరగా, ఆగ్రహంతో అతడు దాడి చేసి గాయపరిచాడు. గురువారం పెనమలూరు PSలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.