ATP: ఆత్మకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 10న మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మీనరసింహ ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు తప్పక హాజరు కావాలని సూచించారు.