E.G: సామాజిక మార్పు కోసం కృషి చేసిన మహనీయుడిగా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని KVPS నాయకులు జువ్వల రాంబాబు పేర్కొన్నారు. శనివారం నిడదవోలులో పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళులర్పించారు. కుల రహితం, సమాజ హితం, సమభావన లక్ష్యంతో ముందుకు వెళ్లడమే ఫూలేకు నిజమైన నివాళి అని అన్నారు.