NDL: బేతంచెర్ల ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించాలని టీడీపీ నాయకులు కోరారు. అటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.