ప్రకాశం: చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి 800 గంజాయి చాక్లెట్లు, 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.