కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఈదరపల్లి, S.యానాం, ఉప్పలగుప్తం గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురం ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.