ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో ఉన్న పుల్లయ్య హోటల్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హోటల్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, మానిటర్తో పాటు సుమారు రూ.10 వేల నగదును అపహరించినట్లు హోటల్ యజమాని తెలిపారు. మంగళవారం ఉదయం హోటల్ తెరవడానికి వచ్చిన యజమాని దొంగతనాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.