TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో పథక సంచాలకులు పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి శ్రామికులకు 310 మంది వరకు పనులు వచ్చే విధంగా మార్కింగ్ ఇవ్వాలని, పనులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.